భార్య రూ.30 లు అడిగినందుకు ట్రిపుల్ తలాక్

భార్య రూ.30 లు అడిగినందుకు ట్రిపుల్ తలాక్

కూరగాయలు కొనడానికి 30రూపాయలు అడిగినందుకు భార్య కు ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. 32ఏళ్ల జైనబ్ అనే మహిళ భర్త సాబిర్ ను శనివారం సాయంత్రం కూరగాయలు కొనడానికి రూ.30 లు అడిగింది. దీంతో కోపానికి వచ్చిన భర్త ఆమెను తీవ్రంగా  కొట్టాడు. భర్త తోపాటు అతని తల్లి, తండ్రి, కూతురు కూడా బైనబ్ పై దాడికి దిగారు. వారు కొడుతుండగా భర్త సాబిర్ స్ర్కూ డ్రైవర్ తో జైనబ్ పై దాడిచేశాడు. అంతటితో ఆగకుండా ఆమెకు కరెంట్ షాక్ కూడా పెట్టాడు. దాంతో పాటే ఆమె ముఖం మీద తలాక్ అని మూడు సార్లు చెప్పి ఇంటినుండి వెళ్లగొట్టాడు.

బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురుకి పెండ్లి అయినప్పటినుంచి అత్తగారింట్లో ఎప్పుడూ సంతోషంగా లేదని అన్నాడు. భర్త తరపు బందువులు అధిక కట్నం కోసం అనేక సార్లు దాడిచేశారని తెలిపాడు. జైనబ్ ఆరోగ్యానికి గురైతే హాస్పెటల్ లో చూయించకుండా పుట్టింటి పంపిస్తానని భర్త బెదిరించాడని బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. విడాకులు ఇవ్వడం కావాలనే చేశారని పోలీసులకు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదులో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త సాబెర్, అతని ఫ్యామిలీ పై 498A, 504,506 సెక్షన్ల కింద కేసును పెట్టారు. సాబిర్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. కోర్టు జూన్30న అతనికి బెయిల్ ఇచ్చింది. అయితే అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.