సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలకు అడవి ఎద్దులు చిక్కినట్లు డీఎఫ్ వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. అడవి ఎద్దుల సంచారం అడవుల సంరక్షణకు అడ్డం పడుతుందని పేర్కొన్నారు. ఈ అడవి ఎద్దుల జాతి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందని తెలిపారు. అడవి ఎద్దులు ఆరోగ్యకరమైన అడవులు, సమృద్ధిగా పశుగ్రాసం, నీటి వనరుల లభ్యత, భద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తాయని చెప్పారు.
