బస్తీల్లో సమస్యలు లేకుండా చేస్తా: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

బస్తీల్లో సమస్యలు లేకుండా చేస్తా: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: బస్తీల్లో మౌలిక వసతులు కల్పించి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్​ అన్నారు. సోమవారం ఆయన మోండా డివిజన్  రెజిమెంటల్ బజార్ లోని అరవ బస్తీ, జూలమ్మ, తుర్కలమ్మ దేవాలయాల ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండబ్ల్యూఎస్​ విభాగాల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మరో 20 ఏళ్ల పాటు ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు.