తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తు కోసం తమతో టచ్ లో ఉన్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు స్టాలిన్. ఒక వేళ ఆరోపణలు రుజువు చేయకపోతే తమిళిసై తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సిద్దమేనా? అని ప్రశ్నించారు.