హైదరాబాద్, వెలుగు: వైన్ షాప్ల కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా తీయనున్నారు. ఆయా జిల్లాల కేంద్రాల్లో అధికారుల నేతృత్వంలో డ్రా తీస్తారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డ్రా తీసే కేంద్రాలకు ఎంట్రీ పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు.
వైన్స్ దక్కించుకున్నోళ్లు ఈ నెల 22 వరకు లైసెన్స్ ఫీజులో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్30 నుంచి కొత్త దుకాణాలకు స్టాక్ రిలీజ్ చేస్తారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్ ఉండగా.. లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.2629 కోట్ల ఆదాయం వచ్చింది.