పార్టీ మారాలనుకున్న నాయకుడిని.. చెప్పుతో కొట్టిన మహిళ

పార్టీ మారాలనుకున్న నాయకుడిని.. చెప్పుతో కొట్టిన మహిళ

పార్టీ మారాలని చూసిన నాయకుడికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పార్టీ మారాలనుకున్న నాయకుడిని ఓ మహిళ చెప్పుతో కొట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన PACS ఛైర్మన్ మోహన్ రెడ్డిని రెండు నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఈ విషయం తెలిసి కాంగ్రెస్ నాయకురాలు మంజుల చెప్పుతో కొట్టింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వీరిమధ్య వ్యక్తగత విబేధాలు ఉండటంతో.. మోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావద్దని మహిళా నాయకురాలు ఇలా చేసిందిదని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వలసలతో.. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు.