- దేనికి ఓటేస్తావని ప్రశ్నించిన హరీష్.. పువ్వు కు ఓటేస్తానన్న మహిళ
కరీంనగర్: ఆర్ధిక మంత్రి హరీష్ రావుకు ఓ మహిళ షాక్ ఇచ్చింది. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రంలో జరిగిదీ ఘటన. జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి హరీష్ రావు వీణవంక మండలం కేంద్రంలో బ్యాంక్ వద్దకు మహిళలు రాగా అక్కడ ఆగి వారితో కొద్దిసేపు ముచ్చట పెట్టారు. మహిళలతో మాట్లాడుతూ దేనికి ఓటేస్తావాని మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నకు.. పువ్వు కు ఓటు వేస్తానంటూ మహిళ సమాధానం ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న హరీష్ రావు.. బిజెపి గ్యాస్ సిలిండర్ ధర పెంచిందని చెప్పి... చివరగా దేనికి ఓటు వేస్తావని మళ్లీ అడిగారు. దీంతో మహిళ దానికి అంటూ నర్మగర్భంగా చెప్పింది. దానికంటే దేనికని అంటూమంత్రి హరీష్ రావు రెట్టించి అడుగగా పువ్వు గుర్తుకు అని మహిళా సమాధానం చెప్పడంతో షాక్ అయిన హరీష్ రావు సరిగ్గా విను అంటూ మళ్లీ వివరించారు.