మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న మహిళలు

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న మహిళలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. మీర్ పేట్ లోని నందీహిల్స్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని..స్థానిక మహిళలు అడ్డుకున్నారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రిని నిలదీశారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారంటూ నిరసన తెలిపారు.