న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేస్తున్నారని.. మహిళా పోలీసు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ లో జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ పీఎస్ ముందు మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగారు.
భూ తగాదా విషయంలో తన భర్త వరుణ్ పై తప్పుడు సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా... తమ పిటిషన్ ను పరిశీలించకుండా తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పారు. ఒక పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ ఐ శివకుమార్ చేసిన అవినీతి, తీసుకున్న లంచాలపై తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.