ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను నిలదీసిన మహిళలు

ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ ను నిలదీసిన మహిళలు

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లోని  ఐకేపీ సెంటర్ భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టొద్దంటూ మహిళలు  నిరసన తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను నిలదీశారు. అక్కడ సమావేశంలోనే  సత్తవ్వ అనే మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తారా అని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోబోయారు ఇతర మహిళలు. దీంతో ఎమ్మెల్యే  సంజయ్ వారిని సముదాయించారు. ఐకేసీ సెంటర్ జాగలో ఇళ్లు కట్టబోమని హామీ ఇచ్చారు. మహిళలు వెళ్లిపోవద్దంటూ బతిమిలాడారు. దీంతో మహిళలు శాంతించారు.