
వికారాబాద్, వెలుగు: ఓ వృద్ధుడు బ్యాంకులో డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకుని వెళ్తున్న డబ్బులను కిలేడీ మహిళలు కొట్టేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ధారూర్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన అనంతయ్య రిటైర్డ్ ఎంప్లాయ్. శుక్రవారం ఆయన వికారాబాద్లోని ఎస్బీఐలో రూ.50 వేలు డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో ముగ్గురు మహిళలు ఆయనను గమనించారు. ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని వారు ఫిక్స్ అయ్యారు.
సదరు వృద్ధుడు మెడికల్ షాపున కు వెళ్లేంతవరకు ఆయన వెనుకాలే వెళ్లారు. మెడికల్ షాపులో మందులు కొంటుండగా బ్యాగులో ఉన్న నగదును తస్కరించి వెళ్లిపోయారు. మెడికల్ షాపులో, బ్యాంకులో సీసీ ఫుటేజీలు గమనించగా మహిళలు చోరీ చేసినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ సీఐ భీం కుమార్ తెలిపారు.