
మహిళ ప్రీమియర్ లీగ్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు అదుర్స్ అనిపించాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, కృతీ సనన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రముఖ రాప్ సింగర్ ఏపి దిల్లాన్ తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు.
WPL వేడుకల్లో భాగంగా ముందుగా కియారా అద్వానీ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్కు డ్యాన్స్ చేసింది. గోవిందా నామ్ మేరా సినిమాలోని క్యా బాత్ హై సాంగ్లో కియారా అద్వానీ ఇరగదీసింది. కియారా అద్వానీ డ్యాన్స్కు అభిమానులు విజిల్స్ వేశారు.
ఆ తర్వాత కృతీ సనన్ మరో సాంగ్లో డ్యాన్స్తో అదరగొట్టింది. చివరల్లో బిజిలీ పాటతో కియారా అద్వాణీ తన డ్యాన్స్ను ముగించగా... చక్దే ఇండియా అంటూ జెండా ఊపుతూ కృతి సనన్ స్టేజ్పైకి వచ్చింది.
ఆ తర్వాత దిల్లాన్ తన స్టైల్లో స్లేజీపైకి వచ్చి సందడి చేశాడు.
అనంతరం దిల్లాన్, కియారా, కృతీ సనన్తో ముగ్గురు కలిసి కలిసి ఆడిపాడారు. ఈ ఆరంభం వేడుకలకు మందిరా బేడి హోస్ట్గా వ్యవహరించింది.