తాలిబన్లతో అలుపెరగని పోరాటానికి రెడీ 

తాలిబన్లతో అలుపెరగని పోరాటానికి రెడీ 

కాబూల్: అఫ్గానిస్థాన్ పై తాలిబన్లు క్రమక్రమంగా పట్టు పెంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని పెంచుకున్న తాలిబన్లు.. మెళ్లిగా నగరాలనూ తమ చేతుల్లోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయంపై అఫ్గాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ స్పందించారు. ప్రజలను కాపాడే బాధ్యత తనదని ఘనీ అన్నారు. దేశంలో సుస్థిరత నెలకొనే వరకు తాలిబన్లతో పోరాటం ఆపబోమన్నారు. అఫ్గానీల మీద యుధ్ధానికి దిగుతున్న తాలిబన్లతో అలుపెరుగని పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తాలిబన్లు ప్రజా ఆస్తిని నాశనం చేయకుండా  కాపాడుకుంటామని పేర్కొన్నారు.