పనిచేస్తున్న షాపులోనే కిలోల బంగారం చోరీ చేసిన వర్కర్

పనిచేస్తున్న షాపులోనే కిలోల బంగారం చోరీ చేసిన వర్కర్
  • షాపులో రెండు కిలోల బంగారం చోరీ
  • వర్కరే నిందితుడు

నిజామాబాద్‌‌ క్రైమ్‌‌, వెలుగు: షాపులో పని చేస్తున్న వ్యక్తే రెండు కేజీల బంగారం, రూ. 10 లక్షలు చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరం కుమార్‌‌‌‌గల్లీ ప్రాంతంలోని ఎస్‌‌కే సిల్వర్ మర్చంట్ షాప్ లో  రాజస్థాన్‌‌ ప్రాంతానికి చెందిన జోగారం ఐదేండ్లుగా పని చేస్తున్నాడు. అతడిపై నమ్మకంతో యజమాని హరీశ్​షాపు ఓపెన్‌‌ చేయమని శుక్రవారం తాళాలు ఇచ్చి పంపించాడు. జోగారం రాజస్థాన్‌‌కు చెందిన మరో వ్యక్తి సాయంతో షాపులో నుంచి  సుమారు రెండు కిలోల బంగారం,10 లక్షల వరకు నగదు అపహరించాడు. యజమాని వచ్చిన తర్వాత షాపులో చోరీ జరిగినట్లు చెప్పాడు. దీంతో యజమాని వన్‌‌ టౌన్‌‌ పోలీస్‌‌లకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ వెంకటేశ్వర్లు చోరీ జరిగిన షాపును పరిశీలించారు. షాపులో పనిచేసే వర్కర్‌‌ ‌‌జోగారం అక్కడే ఉన్నప్పటికీ అతడి ఫ్రెండ్​ఉదయం నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. జోగారంను అదుపులోకి తీసుకొని విచారించారు. నగలు, నగదుతోపాటు మరో వ్యక్తి రాజస్థాన్‌‌కు వెళ్లినట్లు విచారణలో తేలింది.