
ఐపీఎల్ మ్యాచులను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ తెలిపింది. వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్తో పాటు...భారత్, పాక్ మ్యాచుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ను నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
మోదీ స్టేడియంలోనే ఎందుకు..
అక్టోబర్, నవంబర్లలో భారత్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో భాగంగా భారత్ పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ కు అహ్మదాబాదే వేదిక కానుంది. దాయాదిల మ్యాచ్ అంటే భారత్ తో పాటు..ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వస్తుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, లక్ష మంది అభిమానులు మ్యాచ్ చూసే అవకాశం నరేంద్ర మోదీ స్టేడియంలో ఉంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని ఈ స్టేడియంలోనే ఇండో పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోనూ మ్యాచ్లు
ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతోంది. ఇది ముగిసిన వెంటనే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించనుంది. వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఈ లెక్కన అక్టోబర్ 7వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. వరల్డ్ కప్ మ్యాచులకు హైదరాబాద్, నాగ్పూర్, అహ్మద బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి, కోల్కతా, రాజ్కోట్, ఇండోర్, ధర్మశాల, గలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఏడు వేదికల్లో మాత్రమే ఇండియా మ్యాచ్ లు ఉంటాయి. అందులో అహ్మదాబాద్ ఒకటి. ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. అయితే పాకిస్థాన్ టీమ్ మాత్రం భద్రతా కారణాల వల్ల చాలా వరకూ మ్యాచ్ లు కేవలం చెన్నై, బెంగళూరులలోనే ఆడనున్నట్లు సమాచారం.
భారత్లో ఇప్పటి వరకు మూడు సార్లు వన్డే ప్రపంచకప్ జరిగింది. అయితే ఈ మూడు సార్లు కూడా సింగిల్గా హోస్ట్ చేయలేదు. 1987లో పాకిస్తాన్ తో కలిసి భారత్ ఆతిథ్యం ఇచ్చి్ంది. 1996లో పాక్, శ్రీలంకలతో కలిసి మ్యాచులను పంచుకుంది. 2011లో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ లతో కలసి ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చింది. కానీ ఈసారి మాత్రం ఒంటరిగా వన్డే ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తోంది. వ్వనుంది. తాజాగా ప్రపంచకప్ పై బీసీసీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో మొదటిది ప్రపంచకప్ షెడ్యూల్.. రెండోది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వేదిక.