రెస్టారెంట్లో ని సూప్లో పురుగులు

రెస్టారెంట్లో ని సూప్లో పురుగులు

నిజామాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో ఆహారంలో పురుగులు దర్శనమిచ్చాయి. రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కస్టమర్లు ఫైర్ అవుతున్నారు. సూప్ లో పురుగులు వచ్చాయని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లవోలి విందు భోజనం అనే రెస్టారెంట్ లో పురుగులు పడిన ఆహారాన్నిసిబ్బంది కస్టమర్లకు  అందించారు. దీనిపై యాజమాన్యానికి  ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కస్టమర్లు వాపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెస్టారెంట్లు అర్ధరాత్రి టైం దాటే వరకు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటున్నారు స్థానికులు.