జీరో బిల్లు రావడం లేదని ఆందోళన

జీరో బిల్లు రావడం లేదని ఆందోళన

శివ్వంపేట, వెలుగు: జీరో బిల్లు రావడం లేదని శివ్వంపేట మండలం బిజిలీపూర్ గ్రామంలో శుక్రవారం కొందరు వినియోగదారులు ఆందోళన చేశారు. అర్హత ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ గ్రామంలో చాలామందికి జీరో బిల్లు రావడం లేదన్నారు. విద్యుత్​సిబ్బంది బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్​ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో తమకు జీరో బిల్లు రావడంలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలన్నారు.