ఆరేండ్ల క్రితం ప్రేమ వివాహం.. ప్రతి రోజు భర్త చిత్ర హింసలు
సూసైడ్ నోట్ రాసి.. పిల్లలకు ఉరేసి, తాను కూడా ఫ్యానుకు ఉరేసుకున్న ఇల్లాలు
రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో దారుణం
హైదరాబాద్/శంషాబాద్, వెలుగు: “నా భర్త ఓ సైకో.. శాడిస్ట్. మమ్మల్ని బాగా ఏడిపిస్తున్నడు. ఈ బాధలు నేనింక భరించలేను” అంటూ సూసైడ్నోట్ రాసిన ఓ మహిళ.. ఐదేండ్లు కూడా నిండని తన ఇద్దరు పిల్లల్ని చంపి, తానూ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పీఎస్ లిమిట్స్ ఉప్పరపల్లిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రికి చెందిన స్వాతి కుసుమ(33) కుటుంబం కొన్నేండ్లుగా అమీర్ పేటలో ఉంటోంది. స్వాతికి యూసుఫ్గూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయికుమార్(36)తో ఆరేండ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి తన్విక్(5), శ్రీయ(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు ఉప్పర్పల్లి పోర్ట్ వ్యూ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు ఇటీవల తీవ్రమయ్యాయి. ప్రతీ రోజు సాయికుమార్ స్వాతిని చిత్రహింసలకు గురిచేసేవాడు. పిల్లలను కూడా పట్టించుకోకుండా తిరిగేవాడు.
ఫ్యాన్కు ఊరేసుకొని..
శుక్రవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన స్వాతి శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లో మూడు గదులు ఉన్నాయి. వర్క్ఫ్రమ్హోమ్లో భాగంగా భర్త సాయికుమార్ఓ గదిలో పని చేసుకుంటుండగా, స్వాతి పిల్లలు బెడ్రూమ్లో ఉన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో బెడ్రూమ్ డోర్ లాక్ చేసుకున్న స్వాతి.. సూసైడ్ నోట్ రాసి గోడకు అంటించింది. చీరతో ఉరేసి ఇద్దరు పిల్లలను చంపింది. వాళ్లు చనిపోయాక.. అదే చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. పొద్దటి నుంచి ఫ్లాట్ నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్క ఫ్లాట్ వాళ్లు సాయికుమార్కు ఫోన్ చేయగా.. అతను డోర్ ఓపెన్ చేశాడు. అంతా కలిసి స్వాతి కోసం వెతుకుతూ బెడ్రూమ్ డోర్ కొట్టగా స్పందన రాలేదు. పగలగొట్టి చూడగా.. పిల్లలు విగతజీవులుగా, స్వాతి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్వాతి, తన్విక్, శ్రీయల డెడ్బాడీలను పోస్ట్మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. స్వాతి రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సూసైడ్ సమయంలో భర్త సాయికుమార్పక్క గదిలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాతి సూసైడ్కు ముందు పిల్లలను ఎలా చంపిందన్న విషయంపైనా ఆరా తీస్తున్నారు. పోస్టమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
నా భర్త సైకో..
“నా భర్త సైకో, శాడిస్ట్. మమ్మల్ని బాగా ఏడిపిస్తున్నాడు. పిల్లల్ని నన్ను మంచిగా చూసుకోవట్లేదు. తెల్లవారితే భయం వేస్తుంది. పిల్లలకు ఇప్పటి వరకు ఏమి చేయలేదు. కనీసం బట్టలు కూడా కొనివ్వలేదు. ఈ బాధలు నేనింక భరించలేను. మా అక్కచెల్లెళ్లని కూడా తప్పుగా చూశాడు. నాకింక ఓపిక లేదు. అమ్మ నాన్న బాధ పడకండి. నా పిల్లలంటే నాకు పిచ్చి. నేను లేకపోతే వాళ్లను ఎవరు చూస్తారు. అషు, రాజ్ (అక్కా చెల్లెళ్లు) డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ బ్లైండ్లీ” అని సూసైడ్ నోట్ రాసి గోడకు అంటించి సూసైడ్ చేసుకుంది.