బాలికలను వేధించిన యవకుడి ఇంటిపై దాడి

బాలికలను వేధించిన యవకుడి ఇంటిపై దాడి

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీఎన్ తిమ్మాపురం గ్రామంలో ఇద్దరు బాలికలను మేడబోయిన యాకేష్ అనే యువకుడి ఇంట్లో బంధించి వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతని ఇంటిపై దాడికి దిగారు. ఇంటిపై దాడి చేయడమే కాకుండా అతనికి సంబంధించిన రెండు వాహనాలను తగలబెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.