యాదాద్రి, వెలుగు: స్టూడెంట్స్తో అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్, బాత్రూం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన లేడీ ప్రిన్సిపల్ను యాదాద్రి జిల్లా భువనగిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు, స్టూడెంట్స్పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని భువనగిరిలోని ప్రైవేట్స్కూల్లో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఆదివారం క్లాస్ముగిసిన తర్వాత కరస్పాండెంట్రఘు వెంకట సురేశ్(60) ఓ స్టూడెంట్ను పేరెంట్వచ్చేవరకు తన గదిలో ఉండమన్నాడు. ఆ సమయంలో బాలికను కౌగిలించుకొని ముద్దాడాడు. బెదిరిపోయిన స్టూడెంట్ కరస్పాండెంట్ గది నుంచి బయటకు పరిగెత్తింది. అంతలోనే పేరెంట్రావడంతో ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత పేరెంట్స్తో విషయం చెప్పడంతో సోమవారం స్కూల్వద్ద గొడవ జరిగినా విషయం బయటకు రాలేదు. మరికొందరు స్టూడెంట్స్సైతం కరస్పాండెంట్వారితో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని పేరెంట్స్కు చెప్పడంతో మంగళవారం స్కూల్ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు, డిస్ట్రిక్ట్వెల్ఫేర్ఆఫీసర్కృష్ణవేణి, డీసీపీవో సైదులు అక్కడికి చేరుకున్నారు. కరస్పాండెంట్తమతో ఎలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో స్టూడెంట్లు వివరించారు. స్టూడెంట్స్ఆరోపణలను కరస్పాండెంట్ తోసిపుచ్చారు. బాత్రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, తొలగించాలని ప్రిస్సిపల్ సుజాతకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మరో స్టూడెంట్పేర్కొంది. కరస్పాండెంట్ రఘు వెంకట సురేశ్, ప్రిన్సిపల్సుజాతను భువనగిరి టౌన్ పోలీసులు అరెస్ట్చేశారు. వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లా విద్యాశాఖ కూడా స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఆర్జేడీకి ప్రపోజల్స్ పంపించింది.