యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరి గుట్ట: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తజనులు, ఉచిత దర్శన టోకెన్లు పొంది కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. భక్తులు ప్రధానాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. ధర్మదర్శనానికి నాలుగు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

జమ్మూ కశ్మీర్ దాడులకు నిరసనగా ఆప్ నిరసన

యూపీ సీఎం యోగీకి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..