యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు, అర్చకులు. మంగళవారం ( మార్చి 3 ) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు,అనుబంధ ఆలయాలు మూసివేశారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3:20 గంటల నుండి సాయంత్రం 6:47 వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడ్డాయి.
యాదగిరిగుట్ట ఆలయం తిరిగి రేపు ( మార్చి 4 ) తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేయనున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు.
