ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jaganmohan reddy) జీవితంలో జరిగిన కొత్త సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర2 (Yatra2). 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు మహి వి రాఘవ్(Mahi V Raghav) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవ నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 2 నిమిషాల 47 సెకెన్ల నిడివితో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేను అన్న..నా క్రెడిబిలిటీ లేని రోజు మా నాయనా లేడు..నేను లేను..అని జగన్ పాత్రలో నటించిన జీవా చెప్పే డైలాగ్..జగన్ జీవితం గుర్తు చేస్తుంది. నువ్వు మా వైస్సార్ కొడుకువన్న..మాకు నాయకుడిగా నిలబడు అన్న..అని అంధుడి ఆవేదనలో నుంచి వచ్చిన మాటకు..బదులుగా నేను విన్నాను..నేను ఉన్నాను.. అనే డైలాగ్ జగన్ ఆశయాన్ని గుర్తు చేస్తోంది.
యాత్ర 2 ట్రైలర్ చాలా పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్గా సాగింది. వైఎస్సాఆర్ అనంతరం ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటనే విషయాన్ని చాలా ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు. ఆ నేపధ్యంలో వచ్చిన సీన్స్ బాగున్నాయి.
తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయి బాధలో ఉన్న జనాలను ఓదార్చటానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర, దానికి రాజకీయ నాయకులు ఎలా అడ్డుపడ్డారు, జగన్ జైలు జీవితం వంటిని ఈ టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమించారు? సీఎం వరకు ఎలా ఎదిగారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ నెల ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.