స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం.. పార్లమెంట్ లో పోరాటం చేస్తం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం.. పార్లమెంట్ లో పోరాటం చేస్తం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో 25కి.మీ పాదయాత్ర చేస్తున్నారు విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మహాత్మగాంధీ విగ్రహం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు విజయసాయి రెడ్డి పాదయాత్ర జరుగుతోంది. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారని.. విమర్శించే రాజకీయ నాయకులు పోరాటంలో కలిసి రావాలన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడమే గాకుండా పార్లమెంట్ లోపల బయట పోరాటం చేస్తున్నామన్నారు. శక్తివంచన లేకుండా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ప్రపంచంలోనే భారత్ కు పాజిటివ్ ఇమేజ్

పేరుకే హైదరాబాద్.. లోకల్ ప్లేయర్ లేకుండానే బరిలోకి..