కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎడియూరప్ప కుమారుడు

కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎడియూరప్ప కుమారుడు

కర్ణాటక సీఎం ఎడియూరప్ప కుమారుడు బీవై విజ‌యేంద్ర ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్య‌క్షుడిగా నియామ‌కమయ్యారు. బీజేపీ అధ్య‌క్షుడు న‌లిన్ కుమార్ క‌తీల్ విజ‌యేంద్ర‌తో పాటు మ‌రో 9 మంది ఉపాధ్య‌క్షుల‌ను నియ‌మిస్తూ నిన్న(శుక్ర‌వారం) ప్ర‌క‌ట‌న చేశారు. ఉపాధ్య‌క్షులతో పాటు న‌లుగురు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీలు, 10 సెక్ర‌ట‌రీలు, ఇద్ద‌రు కోశాధికారులను న‌లిన్ కుమార్ నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా విజ‌యేంద్ర త‌న తండ్రి పాదాల‌కు న‌మ‌స్క‌రం చేశారు. ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ.. క‌ర్ణాట‌క బీజేపీ ఉపాధ్య‌క్షుడిగా త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు అమిత్ షా, జేపీ న‌డ్డా, న‌లిన్ కుమార్, ఎడియూరప్పకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌ర్ణాట‌క‌లో పార్టీని మ‌రింత బలోపేతం చేయ‌డానికి కృషి చేస్తానని విజ‌యేంద్ర స్ప‌ష్టం చేశారు.