“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యంగ్ డైరెక్టర్ కిషోర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా “మాయోన్”. జూలై 7న రిలీజ్ కానున్న ఈ సినిమా హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్ గా 'ఎదో ఎదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.."నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభించింది. ఈ మూవీతో ఆయనను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన మ్యూజిక్ సారద్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఎదో ఎదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన ఆధారంగా హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్. “మాయోన్” సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ వెర్సస్ సైన్స్ మెయిన్ థీమ్గా మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన “మాయోన్ ను నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం.
ఈ మిస్టరీ థ్రిల్లర్కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ క్లీన్ ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ సర్టిఫికేట్ మంజూరు చేసేటప్పుడు CBFC చిత్రానికి ఎలాంటి కట్లను సూచించ లేదు. హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమాకు ఫోటోగ్రాఫీ స్పెష్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ప్రముఖ కెమెరామ్యాన్ రాంప్రసాద్ “మాయోన్” సెల్యూలాయిడ్ వండర్ గా మలిచారు. ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్ గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఈ సినిమాతో సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. “మాయోన్” చిత్రాన్ని జూలై 7న తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం" అన్నారు.