న్యూఢిల్లీ: రాముడిని హిందువులు మాత్రమే కాదు.. ముస్లింలు కూడా గౌరవిస్తారని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. దేశంలో 99 శాతం మంది ముస్లింలు మత మార్పిడికి గురైనవారేనని కామెంట్ చేశారు. రామజన్మభూమి, బాబ్రీమసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో రాముడి ఆలయం నిర్మాణానికి అనుమతి దొరికిందన్నారు. శనివారం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ” అయోధ్యలో రాముడి గుడి చాలా అందంగా ఉంటుంది. అది హిందువుల కల. మన సంస్కృతి, వారసత్వాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. కాథలిక్స్ కు వాటికన్ సిటీ, ముస్లింలకు మక్కా, సిక్కులకు గోల్డెన్ టెంపుల్ తరహాలో హిందువులకు అయోధ్య పవిత్ర స్థలం కానుంది. రాముడి గుడి కట్టేందుకు ముస్లింలు సహకరించాలి. కొత్త మసీదు కట్టేందుకు హిందువులు కూడా సహకరించాలి”అని రాందేవ్ కోరారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గొడవలు జరుగుతాయని కొందరు ఊహించారని, అది తప్పని తేలిందన్నారు. అయోధ్య తీర్పు తర్వాత దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా శాంతిని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు.
రాముడిని హిందువులే కాదు.. ముస్లింలు కూడా గౌరవిస్తారు.
- దేశం
- November 17, 2019
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు