తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది

 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనదైన శైలిలో విమర్శల బాణాలు సంధించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణలో రోజు రోజుకు ప్రజల్లో బీజేపీ, మోదీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలను చూస్తే గతంలో కార్పొరేటర్ల ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే బీజేపీవి ఉండేవి. కానీ గత ఎన్నికల్లో 38 బీజేపీ గెలిచిందన్నారు. బీజేపీ, మోదీపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. 

శాసనసభకు సంబంధించి గత ఎన్నికలు తెలుగుదేశంతో కలిసి పోరాడితే బీజేపీతో గెలిచిన సీట్ల కంటే ఇప్పుడు సొంతంగా బీజేపీ పోటీ చేసి గెలుస్తోందన్నారు. ఇప్పుడు ముగ్గురు నేతలు గెలిచారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. దీంతో సహజంగానే ప్రస్తుత ప్రభుత్వం ఆందోళనలో ఉందన్నారు. హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందన్నారు.  ప్రతి బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని సింధియా తెలిపారు. కేంద్ర నిధులపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే  అని చెప్పారు.తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా సాయం చేస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన... ముర్మును అవమానించడమంటే గిరిజనులు, మహిళలను కించపరచడమేనని స్పష్టం చేశారు.