యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తండ్రి అకాల మరణంతో నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి.
నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నిఖిల్ను పరామర్శిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే స్పై టైటిల్తో ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. అంతేకాదు నిఖిల్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. స్పైని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. వరుస ప్రాజెక్ట్స్తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్కు తండ్రి లేరనే విషయం తెలిసి అందరిని కలిచివేస్తోంది.
మరిన్ని వార్తల కోసం
అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
శాకుంతలం నుంచి మరో పోస్టర్ రిలీజ్