రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. యువతి ప్రేమించడంలేదన్న కోపంతో ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. నార్సింగి గ్రీన్ టీహోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది.
గణేష్ అనే వ్యక్తి జొమాటోలో పనిచేస్తున్నాడు. వాసవి అనే అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. వీరిద్దరు దూరపు బంధువులు. వాసవిని ప్రేమించాలని గణేష్ కొద్ది కాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఈ విషయంపై మాట్లాడుదామని ఆమెను గణేష్ పిలిపించాడు. దీంతో వాసవి నార్సింగి గ్రీన్ టీ హోటల్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వాసవి మీద గణేష్ కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో వాసవి మెడ, చేతులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.