ప్రేమించడం లేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి..

ప్రేమించడం లేదన్న కోపంతో  యువతిపై  కత్తితో దాడి..

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. యువతి ప్రేమించడంలేదన్న కోపంతో ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. అమ్మాయికి  తీవ్ర గాయాలయ్యాయి. నార్సింగి గ్రీన్ టీహోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది.

గణేష్ అనే వ్యక్తి జొమాటోలో పనిచేస్తున్నాడు. వాసవి అనే అమ్మాయి సాఫ్ట్ వేర్  ఇంజనీర్ గా పనిచేస్తోంది. వీరిద్దరు దూరపు బంధువులు. వాసవిని ప్రేమించాలని గణేష్ కొద్ది కాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఈ విషయంపై  మాట్లాడుదామని ఆమెను గణేష్  పిలిపించాడు. దీంతో వాసవి నార్సింగి గ్రీన్ టీ హోటల్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో  వాసవి మీద  గణేష్ కత్తితో దాడిచేశాడు.  ఈ దాడిలో వాసవి మెడ, చేతులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఆమెను  స్థానికులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.