![బోరబండలో యువకుడి దారుణ హత్య](https://static.v6velugu.com/uploads/2024/05/18_ItO03Plgd2.jpg)
- నిమ్స్ మే గ్రౌండ్ లో ఘటన
- మృతుడు వనపర్తి జిల్లా వాసి
జూబ్లీహిల్స్,వెలుగు: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బోరబండ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రహ్మత్నగర్డివిజన్కార్మికనగర్బస్టాప్సమీపంలోని నిమ్స్మే ఖాళీ స్థలంలో ఓ యువకుడిని మర్డర్ చేసినట్టు పోలీసులకు బుధవారం ఉదయం సమాచారం అందింది. ఎస్సార్నగర్డివిజన్ఏసీపీ పి.వెంకట రమణ, బోరబండ ఇన్స్పెక్టర్ ఎస్.వీరశేఖర్ టీమ్ వెళ్లి పరిశీలించారు. క్లూస్టీంతో ఆధారాలను సేకరించారు. మృతుడి పొట్ట, వీపుపై కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు గురైన యువకుడిని వనపర్తి జిల్లా అడ్డాకుల మండలం, కందూరు గ్రామానికి చెందిన తరుణ్తేజ (28) గా గుర్తించారు. ఇతడు టీవీ సీరియల్స్లో మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్టుగా తెలిసింది. ఎల్లో కలర్ టీ షర్ట్, నిక్కర్ధరించి ఉండగా చెవికి పోగులు, చేతికి కడియంతోపాటు చేతిలో సెల్ఫోన్ఉంది.
గోడ పక్కన డెడ్ బాడీ ..
యువకుడి డెడ్ బాడీ గ్రౌండ్ లోని గోడ పక్కన ఉంది. అక్కడే హత్య జరిగిందా..? లేక ఎక్కడైనా చంపి ఇక్కడ పడేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ఖాళీ స్థలంలోకి వెళ్లాలంటే స్థానికులకు మాత్రమే సాధ్యం. నాలాపై న ఖాళీ ఉన్నట్టు అక్కడి వారికి మాత్రమే తెలిసే చాన్స్ ఉంది.