కానిస్టేబుల్ జాబ్ రాలేదని.. యువకుడి ఆత్మహత్య

కానిస్టేబుల్ జాబ్ రాలేదని.. యువకుడి ఆత్మహత్య

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా ధరూర్ మండలంలో కానిస్టేబుల్ జాబ్ రాలేదని దేవార్జున్ (25) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సింహులు, దౌలమ్మ దంపతుల కొడుకు దేవార్జున్ కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాడు. గురువారం విడుదలైన ఫలితాల్లో బీసీ (డీ) విభాగంలో 128 మార్కులు కటాఫ్ కాగా, దేవార్జున్​కు 127 మార్కులు వచ్చాయి.

దీంతో జాబ్ రాక మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. పొలం పనికెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికొచ్చి చూసేసరికి దేవార్జున్ చనిపోయి ఉండటంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లె ఉన్నారు.