- అనుమానాస్పద మృతి కింద కేసు ఫైల్ చేసిన పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కు చెందిన చందన్ వాస్కెల్(18) బతుకు దెరువు కోసం సిటీకి వచ్చి సుభాష్నగర్లోని శ్రీబాలాజీ ఆటో ఏజెన్సీస్ లో హెల్పర్, డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న చందన్ ఆదివారం రాత్రి 11 గంటలకు బాత్రూంకు వెళ్లి అక్కడే కిందపడిపోయాడు.
అతడి ఫ్రెండ్స్ గమనించి వెంటనే హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. చందన్ మృతికి కారణాలు తెలియదని.. కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.