తుళ్లూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం

తుళ్లూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతులు నిరసనలకు దిగారు.  రైతులు చేస్తున్న ఆందోళనలు 25వ రోజుకి చేరాయి. ఒకపక్క రైతుల అరెస్టులతో రాజధాని ప్రాంతాలు అట్టుడికి పోతున్న సమయంలో ఇవాళ(శనివారం) ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజధానిలో కలకలం రేపింది. తుళ్లూరులో మహధర్నా శిబిరంలో రైతులు దీక్షలు చేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, పోలీసులు గమనించి అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని జానీగా గుర్తించారు. అయితే రాజధాని తమ ప్రాంతం నుంచి తరలిపోతుందనే ఆవేదనతో  అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.