నార్సింగిలో దారుణం.. యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

నార్సింగిలో దారుణం.. యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనం కలిగించింది. హైదర్ షా కోట్ విలేజ్…. లక్ష్మీ నగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్ళిన షారూఖ్ సల్మాన్ కత్తితో దాడి చేశాడు.  అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో…ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పొడిచి పారిపోతున్న సల్మాన్ ను.. స్థానికుల సాయంతో  అపార్ట్ మెంట్ వాసులు పట్టుకున్నారు. నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.