ప్రేమ పేరుతో మైనర్ కు పురుగుల మందు తాగించిన యువకుడు

ప్రేమ పేరుతో మైనర్ కు పురుగుల మందు తాగించిన యువకుడు

ప్రేమిస్తున్నానంటూ మైనర్ బాలికకు పురుగుల మందు తాగించాడు ఓ యువకుడు. 48 గంటల తర్వాత.. బాధితురాలు హాస్పిటల్ లో ప్రాణాలు కోల్పోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓగులాపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తంగళ్లపల్లిలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న బండి రాజు… పక్కింట్లో ఉండే బాలికను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించాడు. సోమవారం అర్థరాత్రి బాలికను ఊరి బయటకు తీసుకెళ్లాడు. అమ్మాయికి  పురుగుల మందు తాగించాడు. పరిస్థితి విషమంగా మారడంతో.. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఐతే.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. తన బిడ్డ చావుకు కారణమైన రాజును పోలీసులు కఠినంగా శిక్షించాలంటున్నారు బాధితురాలి తల్లిదండ్రులు.