కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఇంట్లోని టేబుల్ఫ్యాన్ ను అడ్జస్ట్చేస్తుండగా కరెంట్షాక్తో ఓ యువతి చనిపోయింది. ఎస్సై నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పుల్సం సమ్మయ్య, చంద్రమ్మ దంపతులకు కూతురు సౌందర్య(25), ఇద్దరు కొడుకులు ఉన్నారు.
వీరిది వ్యవసాయ కుటుంబం. సౌందర్య టెన్త్పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి గాలి రావట్లేదని ఇంట్లోని టేబుల్ ఫ్యాన్ను అడ్జస్ట్చేస్తుండగా కరెంట్ షాక్తగిలి అక్కడికక్కడే చనిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.