మహబూబాబాద్ జిల్లాలో.. కరెంట్ ​షాక్​తో యువతి మృతి

 మహబూబాబాద్ జిల్లాలో.. కరెంట్ ​షాక్​తో యువతి మృతి

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఇంట్లోని టేబుల్​ఫ్యాన్ ను అడ్జస్ట్​చేస్తుండగా కరెంట్​షాక్​తో ఓ యువతి చనిపోయింది. ఎస్సై నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పుల్సం సమ్మయ్య, చంద్రమ్మ దంపతులకు కూతురు సౌందర్య(25), ఇద్దరు కొడుకులు ఉన్నారు.

వీరిది వ్యవసాయ కుటుంబం. సౌందర్య టెన్త్​పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి గాలి రావట్లేదని ఇంట్లోని టేబుల్ ఫ్యాన్​ను అడ్జస్ట్​చేస్తుండగా కరెంట్ షాక్​తగిలి అక్కడికక్కడే చనిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.