సికింద్రాబాద్ అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ఓ యువతి రాష్ డైవింగ్ వల్ల ముగ్గురు గాయపడగా.. ఒకరు మృతి చెందారు. అల్వాల్ సుభాష్నగర్లో ఈ ఘటన జరిగింది.
శివానీ అనే యువతి ర్యాష్ డ్రైవింగ్ తో ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. రెండు టూ వీలర్స్ ను బలంగా గుద్దింది. అనంతరం కరెంట్ స్థంభానికి కారు బలంగా తాకడంతో.. స్తంభం రెండు ముక్కలుగా విరిగింది. స్తంభం పక్కన బైక్ పై ఉన్న స్విగ్గి డెలివరీ బాయ్ ను కారుతో ఢీకొట్టింది, దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలైన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటనలో ఒక బైక్, చెరుకు రసం బండి, రొట్టేల బండి పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రాష్ డ్రైవింగ్ చేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానాజీ గూడకు చెందిన శివానీ (26) గా గుర్తించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన శివానీకి.. బీపీ డౌన్ కావడంతోనే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు.