బషీర్ బాగ్, వెలుగు : బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని బైక్పై వేగంగా వచ్చిన ఓ యువకుడు ఢీ కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైన సంఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్లోని విజయ డయాగ్నోస్టిక్లో అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న దూల్పేట్కు చెందిన మయూరి (22) లిబర్టీ చౌరస్తా నుంచి ఎల్బీ స్టేడియానికి వెళ్లే దారిలో మోర్ మెడికల్ షాప్ ఎదురుగా ఉన్న బస్టాప్లో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బస్సు కోసం ఎదురు చూస్తోంది.
అదే సమయంలో కెనటిక్ హోండా బైక్పై వేగంగా వచ్చిన మహ్మద్ ఇస్మాయిల్ ఆ యువతిని ఢీకొట్టడంతో ఆమె కాలు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు 108 అంబులెన్స్లో యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి యువకుడిని, ప్రమాదానికి గురైన బండిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు నారాయణగూడ ఎసై షేక్ షఫీ తెలిపారు.