పిల్లలు ఇంగ్లిష్లో ఒక్కపేరాగ్రాప్ కూడా రాస్తలేరు
ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన కేవీపీఎస్, ఎంవీఎఫ్ నాయకులు
వికారాబాద్ జిల్లా, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్ధులకు చదువులు సక్రమంగా చెప్పడంలేదని కేవీపీఎస్, ఎంవీఎఫ్లు ఎమ్మెల్యే డాక్టర్ అనంద్కు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్రెడ్డి, ఎంవీఎఫ్ మండల ఇన్చార్జి వెంకటయ్య ఆదివారం ఎమ్మెల్యేను క్యాంప్ ఆఫీసులో కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా విద్య అందించాలన్న నిబంధనలు అమలుకు నోచుకోవడంలేదన్నారు.
వికారాబాద్ మండలంలోని 13 గ్రామాల్లో విద్యా సామర్ధ్యాల సాధన కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, సీఆర్పీఎఫ్ నాయకులు, సామాజిక కార్యకర్తలు గత ఏప్రిల్ లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదవుతున్న 5 నుంచి 10వతరగతి విద్యార్ధులపై చేసిన ఆద్యయనంలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని వారు వివరించారు. తమ అధ్యయనంలో 377 మంది బాలలకు 3 వతరగతి సామర్ద్యాలతో కూడిన పత్రం ద్వారా తెలుగు, గణితం, ఇంగ్లిష్ విషయాలపై విద్యా సామర్ద్యాలపై పరిశీలించామని, విద్యార్ధులు తెలుగులో కనీసం నాలుగైదు సరళమైన వ్యాక్యాలు కూడా రాయలేకపోతున్నట్లు గుర్తించామన్నారు. గణితంలో చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, గుణంకాలు, బాగాహారాలు చేయలేకపోవడం, ఆంగ్లములో పదాలు, వాక్యాలు, సోంతంగా పెర గ్రాప్ రాయడంలోనూ వెనుకంజవేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం 5నుంచి 9 వరకు పూర్తి చేసిన విద్యార్థులు వారి తరగతి తగ్గ సామర్ద్యాలు పొందడంలో పూర్తిగా వెనుబడి ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు.