గోదావరిలో యువకుడి గల్లంతు

గోదావరిలో యువకుడి గల్లంతు

మంగపేట, వెలుగు : గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన రాంశెట్టి రాము (23) తన మిత్రుని తాత దహన సంస్కారాలకు వెళ్లినపుడు శుక్రవారం ఈ ఘటన జరిగింది. రాము బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కమలాపురం గ్రామానికి చెందిన తన మిత్రుని తాత దహన సంస్కారాలకు రాము హాజరయ్యాడు.

అంత్యక్రియలు పూర్తికాగానే స్నానం చేయడానికి కమలాపురంలోని ఇంటెక్వల్ సమీపంలో గోదావరి నీటిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న  మంగపేట ఎస్సై గోదారి రవికుమార్  ఘటనా స్థలానికి చేరుకున్నారు. పడవలు, గజ ఈతగాళ్ల సహాయంతో రాము కోసం గాలింపు చర్యలు చేపటినా జాడ దొరకలేదు.