యువత సవాళ్లకు ఎదురు నిలిచి పోరాడాలి : గవర్నర్ తమిళిసై

యువత సవాళ్లకు ఎదురు నిలిచి పోరాడాలి : గవర్నర్ తమిళిసై

ఓయూ, వెలుగు: సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని గవర్నర్ తమిళిసై యువతకు పిలుపునిచ్చారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వర్సిటీలో బుధవారం జరిగిన వై20 ఇండియా ఉత్సవాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా   పోరాడి మరింత శక్తివంతంగా ఎదగాలన్నారు. నిరాశ, కుంగుబాటుకు చోటు ఇవ్వకూడదన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, మన దేశం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ దేశం పురోగతిలో యువత పాత్ర ఎంతో ఉందన్నారు. ఇఫ్లూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సురేశ్​కుమార్‌ మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసం యువత పాటుపడాలన్నారు.