ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య

హైదరాబాద్:  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్ యానిమేషన్ స్టోరీ రైటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నగరంలోని మణికొండలోచోటుచేసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మణికొండలోని పంచవతి కాలనీలో నివాసం ఉంటున్న దాసరి లలితా సాయి ప్రశాంత్(45)... తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని  పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాయి ప్రశాంత్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు చెప్పారు.