
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన తర్వాత జగన్ నేరుగా.. ప్రగతి భవన్ కు వెళ్లారు. వైఎస్ జగన్ ప్రగతి భవన్ కు వెళ్లడం ఇదే మొదటిసారి. క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన జగన్ కు సీఎం కేసీఆర్.. పండ్లు, పూలతో స్వాగతం పలికారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు జగన్ కు వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్… జగన్ ను ఆలింగనం చేసుకున్నారు.
తర్వాత జగన్ ను కేసీఆర్ సాదరంగా లోపలికి ఆహ్వానించారు. కేసీఆర్ – జగన్ భేటీలో.. వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. వైఎస్ జగన్ కు… పార్టీ సీనియర్ నేతలను, రాష్ట్ర మంత్రులను పేరుపేరునా పరిచయం చేశారు కేసీఆర్.
ఈనెల 30న ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నాననీ … ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని కేసీఆర్, కేటీఆర్ లను కోరారు జగన్.