లండన్: వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ను ఇండియా మెన్స్ టీమ్ ఘన విజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన గ్రూప్–-7 తొలి పోరులో ఇండియా 3–-0తో ట్యునీసియాను చిత్తు చేసింది. మనుష్ షా, మానవ్ థక్కర్, హర్మీత్ దేశాయ్ తమ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.
మనుష్ 3–-1తో ఎస్సిద్ వసీంపై నెగ్గగా.. మానవ్ 3–-0తో యూసఫ్ ఐడ్లీని, హర్మీత్ 3–-0తో అబూబాకర్ బౌరాస్ను ఓడించి ఇండియాకు తిరుగులేని విజయాన్ని అందించారు. మరోవైపు, అమ్మాయిల టీమ్కు అదృష్టం కలిసొచ్చింది. ఉగాండాతో జరగాల్సిన తొలి మ్యాచ్కు ప్రత్యర్థి జట్టు హాజరుకాకపోవడంతో ఇండియాకు 3–-0తో వాకోవర్ లభించింది.

