- అందజేస్తున్న షాలిని యాజమాన్యం
తిమ్మాపూర్, వెలుగు: పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుడదనే ఉద్దేశంతో స్కాలర్షిప్స్అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది షాలిని విద్యాసంస్థల ట్రస్ట్. తమ జ్యోతిష్మతి కాలేజీల్లో బీటెక్చదివే విద్యార్థులకు ఏటా రూ.18వేల స్కాలర్షిప్స్అందిస్తామని, కాలేజీలో చేరిన దాదాపు 400 మందికి రూ.72 లక్షలు అందజేస్తోంది. ఇందులో భాగంగా గురువారం 82 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేలా తమవంతు ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని షాలిని ట్రస్ట్ స్కాలర్షిప్స్ అందజేయడం సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల యాజమాన్యం, చైర్మన్సాగర్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు.
