తెలంగాణ పైసలు.. పంజాబ్​ రైతులకు పంచుతున్నడు

తెలంగాణ పైసలు.. పంజాబ్​ రైతులకు పంచుతున్నడు

సీఎం కేసీఆర్​పై షర్మిల మండిపాటు

హైదరాబాద్  : ‘‘రాష్ట్ర ప్రజల పైసలను పంజాబ్ రైతులకు పంచడానికి మీ తాత జాగీరా?” అని సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో ఫైర్ అయ్యారు. ‘‘మన రైతులను ఆదుకోవటానికి చేతులు రావు. పంటలు కొనటానికి మనసొప్పదు. సర్పంచ్ లకు బిల్లులు ఇయ్యడానికి నిధులుండవు. విద్యార్థులు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వడానికి” అని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలానికి చెందిన రైతు దబ్బేట మల్లేశం మృతి.. సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అప్పులు తెచ్చి పంచాయతీ పనులు చేసిన సర్పంచ్​లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం : -

రాష్ట్ర సంపదంతా ఆంధ్రా కాంట్రాక్టర్లకు ధారాదత్తం 


ట్రైబల్ వర్సిటీ అడ్మిషన్లు ఈ‌‌‌‌‌‌‌‌సారీ‌‌‌‌‌‌‌‌ లేనట్లే!