
హైదరాబాద్: దళితులపై ప్రేమతోనే దళితబంధు ద్వారా 10 లక్షలు ఇస్తున్నామని చెప్పుకొంటూనే.. మరోవైపు దళితుల భూములను లాక్కొనే పథకాన్ని సీఎం కేసీఆర్ మొదలు పెట్టాడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏం చేసినా దళితులు నోరు మూసుకొని పడుంటారనే భావనతోనే కేసీఆర్ భూములు, ఇండ్లు లాక్కుంటున్నాడని ఆమె అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు కానీ.. ముత్తాతల నుంచి దున్నుకుంటున్న భూమిని మాత్రం ఆక్రమించుకుంటున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘దొరా.. నువు మారవా? దళితబంధు 10 లక్షలు ఇస్తున్నా అంటివి. అవమానించినా, ఆశ పెట్టినా, ఏం చేసినా దళితులు నోరు మూసుకొని పడుంటారు అనే కదా కేసీఆర్ భూములు, ఇండ్లు లాక్కొనేది? మూడు ఎకరాల భూమి ఇవ్వ చాతకాలేదు కానీ.. ముత్తాతల తండ్రులనుంచి దున్నుకుంటున్న భూములను మాత్రం లాక్కొంటున్నాడు.
పార్కుల కంటూ.. పరిశ్రమల కంటూ.. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమిని లాక్కొని భూమి మీద ఆధారపడి బతుకుతున్న పేద ప్రజలను రోడ్డున పడేస్తున్నాడు కేసీఆర్ దొర. ఒకవైపు దళితులపై ప్రేమతోనే దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నాం అని చెప్పుకొంటూనే.. మరోవైపు దళితుల భూములను లాక్కొనే పథకం మొదలు పెట్టిండు.
దొరా.. నువు మారవా?
— YS Sharmila (@realyssharmila) August 14, 2021
దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నాం ..
అవమానించినా,
ఆశ పెట్టినా,
ఎం చేసినా
దళితులు నోరు మూసుకొని పడుంటారు అనే కదా KCR భూములు ఇండ్లు లాక్కొనేది?
మూడు ఎకరాల భూమి ఇవ్వ శాతకాలేదు కానీ ..
ముత్తాతాతల తండ్రులనుంచి దున్నుకుంటున్న భూములను మాత్రం లాక్కొంటున్నాడు 1/2 pic.twitter.com/1iEpxWTAoQ