చంటి పిల్లల తల్లులకు పాచిపోయిన అన్నం పెడతరా?

చంటి పిల్లల తల్లులకు పాచిపోయిన అన్నం పెడతరా?

కేసీఆర్ ను గిరిజన దళం తరిమి కొడుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోడు భూములను లాక్కోవద్దన్నందుకు గిరిజన మహిళా రైతులను జైల్లో పెట్టి నరకం చూపించారని ఆమె మండిపడ్డారు. చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా.. వారికి పాచిపోయిన అన్నం పెట్టారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును విమర్శిస్తూ.. ఆమె తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు.

‘సిగ్గుపడండి KCR గారు .. మీ పాలనలో మహిళకు దక్కుతున్న సత్కారాలకు.  KCR దొరగారి ఖాకీలు, చంటి పిల్లలున్న తల్లులని కూడా చూడకుండా.. వారితో అడ్డగోలు పని చేయించి.. పాచిపోయిన అన్నం పెడతారా? అన్నం బాగాలేదంటే లాఠీలతో కొడతారా..? కాళ్ళు పడితేనే అన్నం పెడతారా? పోడు చేసుకునే భూములు లాక్కోవద్దు అంటే గిరిజన మహిళా రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఆపై జైలుకు పంపి జైల్లో కూడా నరకం చూపించారు. మీ అహంకార పాలనపై తిరుగబడుతుంది మహిళా సైన్యం. రేపు మిమ్ములను తరిమి కొడుతుంది ఈ గిరిజన గళం’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.