ఎంపీ అర్వింద్ పై షర్మిల విమర్శలు

ఎంపీ అర్వింద్ పై షర్మిల విమర్శలు

పసుపు బోర్డ్ తెస్తానని చెప్పిన బీజేపీ ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు వైఎస్ షర్మిల. నిజామాబాద్ ,ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన షర్మిల..దేశంలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ నెంబర్ వన్ అని అన్నారు. నిజాం షుగర్ ప్రాజెక్ట్ ను నడిపించే విధంగా వైఎస్సార్ ఆనాడు కేంద్రాన్ని సైతం ఒప్పించారన్నారు. బాసర లో ట్రిపుల్ ఐటీ, నిజామాబాద్ లో యూనివర్సిటీ వైఎస్సార్ ఏర్పాటు చేశారన్నారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ అదిలాబాద్ అని అన్నారు. మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ ది.. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండ రామ్ పుట్టిన గడ్డ అదిలాబాద్ అని కొనియాడారు. బైంసా అల్లర్లకు ఎవరు బాధ్యులని.. రాజకీయాల కోసం సామాన్యులను ఇబ్బందులపాలు చేస్తారా అని ప్రశ్నించారు షర్మిల